29, జూన్ 2012, శుక్రవారం

ప్రాజెక్ట్ భూతం

చరిత్ర ఎప్పుడు అబద్దం చెప్పదు. చరిత్ర మరల , మరల రిపీట్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా నిర్వాసితులకు కలిపించాల్సిన వసతులు , వాళ్ళ హక్కులను గౌరవించాల్సిన విషయం లో ప్రభుత్వాలు ధగకోరుతనం గా నే ప్రవర్తిస్తున్నాయి . ఎవరిని మోసం చేస్తుంది ఈ ప్రజా ప్రబుత్వాలు . ప్రజలనినా లేక దేశాన్న ?


వైజాగ్ , సింహాద్రి NTPC ధర్మల్ పవర్ ప్లాంట్ అవసరాల కోసం ప్రభుత్వ హామీలను నమ్మి తమ జీవనాదారం వదులుకొని జీవిస్తున్న ప్రజలకు ప్రభుత్వాలు ఖచితంగా అంతకు మించి జీవన ఉపాది కలిపించాలి . భారత దేశం లో భూమి జీవితం ,అజీవితన్నే ప్రజా ,దేశ అభివృద్దికి ఉపయోగిస్తున్నప్పుడు అక్కడ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కలిపించాల్సిన బాద్యత ప్రభుత్వానిది , పాలితులది . భూమి , ఉపాది కోల్పోయిన ప్రజలకు ప్రభుత్వ లేక ఆయా ఖర్మగారాలలో ఉద్యోగం ఎప్పటికి సమానం కాదు ,కానీ జీవించాలి ,జీవించేందుకు మార్గం కావాలి , ఆ మార్గాన్నే ప్రజలు కోరుకుంటుంది .
మన రాష్ట్రము లో ఈ పునరావాస హామీలు అన్ని నీటి మూటలే, ఆనాటి నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం , నేటి సింహాద్రి NTPC వరకూ అంతా మోసమే . పునరావాసం పేరుతొ భలవంతపు , నిర్బంద settlements జరుతున్నాయి . ఇంకా చెప్పాలి అంటే ప్రజలు తమ సాంఘిక , సాంస్కృతిక జీవిత విదానాన్ని వదులుకొని తమ భూమిని ప్రాజెక్ట్ లకు ఇస్తున్నారు. 

భూమి కోల్పోయిన ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న ఆర్ధిక సహాయం దయతో చేస్తున్నట్టు గా ఉంది కానీ ప్రభుత్వ కనీస ధర్మం గా ఆలోచించటం లేదు . ఈ విషయం లో ప్రభుత్వం కొన్ని గ్రూప్ లుతో కుమ్మక్కు అయి ప్రజలను తమ పోలీసు బలగం తో అణిచి వేస్తున్నాయి . ప్రజలను తీవ్రవాదులుగా చూస్తున్నాయి .పాలకులు ఈ పెడదోరని వీడాలి లేకుంటే ముందు ముందు ఈ దేశం లో ఎలాంటి ప్రాజెక్ట్ వచ్చే పరిస్తితి లేదు ఇంకా చెప్పాలి అంటే అది దేశ అభివృద్ధికే ఆటంకంగా మారుతుంది .

నిన్న సింహాద్రి NTPC నిర్వాసితుల పై జరిగిన కాల్పులను ఖండిస్తూ ..ప్రబుత్వ దోరణి కి నిరసిస్తున్నాం .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి