27, జూన్ 2012, బుధవారం

నాయకుడు .


ఈ మద్య కాలం లో మన రాష్ట్రము లో ఒక్క విచిత్ర సంఘటన ఆరు నెలలకి ఒక్కసారి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులూ చలో డిల్లీ అంటూ గుంపులు గుంపులు గా వెళ్తున్నారు కొంత మంది ఎవరికి కనిపించకుండా , బహుశా బార్య పిల్లలకు కూడా చెప్పకుండా వెళ్తున్నారు అనుకుంటా ! కొంత మంది ఏమో ధూం - ధాం అంటూ ఈ రోజూ రేపో తేల్చుకొని వస్తాం అని చెప్పి డిల్లీ విమానం ఎక్కేస్తున్నారు .అసలకు ఎందుకు ఈ పరిస్తితి వస్తుంది . దీనిని ఏమైనా " డిల్లీ మానియా " అంటారా లేక ఇంకేదైనా కొత్త రకం పేరు ఏమైనా ఉందా !
సరిగ్గా ఇలాంటి పరిస్తితే అప్పుడు ఒక్క సినిమా నటుడు తెలుగు వాడి ఆత్మ గౌరవం అని ఒక్క పార్టి పెట్టి ఈ దేశం లో తెలుగు వాడికి ఒక్క గుర్తింపు తెచ్చేడు . ప్రాంతీయ పార్టీలకు ఈ దేశంలో మార్గదర్సకుడు మన తెలుగు వాడు అయ్యాడు , కానీ ఇప్పుడు మరల అదే గోల . బహుశా కాంగ్రెస్ పార్టి లక్షణం అనుకుంటా ? కానీ గత కాంగ్రెస్ (2004 to 2009 ) ప్రభుత్వ కాలం లో ఏమి జరిగిందో ఏమో కానీ ఆ యాత్రలు బహుశా లేవు అని చెప్పవచ్చు . దీని అంతటికి కారణం " లీడర్ " -  నాయకుడు లేకపోవటం .
అధినాయకత్వం ' నాయకులను ' తాయారు చెయ్యటానికి తమ శక్తి వంతం లేకుండా ప్రయత్నిస్తుంది , అరువు కూడా తెచ్చు కుంది , ప్రజలు గుర్తించటం లేదు . నాయకుడు బొమ్మ కాదు తయారు చెయ్యటానికి , నాయకుడు సహజంగా పుట్టాలి , ప్రజల హృదయ స్పందన నుండి రావాలి అప్పుడే చరిత్ర గుర్తిస్తుంది ...చనిపోయిన జనం హృదయంలో జీవిస్తూ ఉండాలి అతడే నిజమైన నాయకుడు . 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి