17, జూన్ 2012, ఆదివారం

రాజకీయ - సామజిక సమీకరణలు.- ఆంధ్రప్రదేశ్


ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కొత్త రాజకీయ సమీకరణాలకు వేదిక కాబోతుంది. ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం ప్రక్యాత సినిమా నటుడు NT రామారావు తెలుగు దేశం పార్టి ఆవిర్భవించినప్పుడు ఒక్క క్రొత్త రాజకీయ వరవడిని సృష్టించి వెనకబడిన వర్గాలను తమ వైపుకు తిప్పుకుని ఈ రాష్ట్రంలో ఒక్క పెను ప్రభంజనం సృష్టించింది . పేరుకు తెలుగు వాడి ఆత్మగౌరవం తో ఏర్పడిన దాని మూలం మాత్రం సామజిక కుల సమీకరణము మాత్రమే . ఆనాటి నుండి నేటి వరకు అవర్గము అది తమ సొంత పార్టి గా అనుకుంటూ వచ్చారు . వెనకబడిన తరగతులను ప్రోస్తాహించటం వలన ఆపార్టి మనుగడ సాధిస్తూ వస్తుంది . ఇదేసందర్బం లో జాతీయ కాంగ్రెస్ ఆంద్ర రాష్ట్రం లో రెడ్డి సామజిక వర్గం నాయకత్వం లో మిగత దళిత ,ముస్లిం కులాలు తమ పార్టీగా చెప్పుకుంటూ వస్తున్నారు .
అయితే ఇటీవల కాలం లో Dr వై ఎస్ రాజశేకర్ రెడ్డి ముక్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కాలంలో చాల వర్గాలకు తను వ్యక్తి గతంగా చాల దగ్గర అయ్యేడు . అతినిని ప్రజలు అక్కున చేర్చుకున్నారు. అయితే రాజశేకర్ రెడ్డి గారు అకాల మరణం తరువాత ఈ రాష్ట్రం లో రాజకీయ ,సమజకంగా పెను మార్పులు సంభవించాయి. రాజశేకర్ రెడ్డి తనయుడు వివిధ కారణాలన కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి సొంతగా పార్టి స్తాపించటం , రాజశేకర్ రెడ్డి ని అభిమానించే కొంతమంది MLA లు ఆ పార్టికి మద్దతు ఇవ్వటం ,అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టి కి వెతిరేకంగా అవిస్వాసతీర్మానానికి మద్దతు పలకటం , తమ అధికారం కోల్పోయి మరల వై ఎస్ జగన్ స్తాపించిన వై ఎస్ ర్ కాంగ్రెస్ పార్టి నుండి ఎన్నికలకు వెళ్ళటం మనకు తెలిసిందే. అయితే ఈ ఎన్నికల లో ఒక్క గొప్ప మార్పుని మనం గమనించాలి. మొత్తం 18 అసెంబ్లీ , ఒక్క పార్లమెంట్ నియోజకవర్గం లో అధికార కాంగ్రెస్ పార్టికి 5 స్తానలలో ధరావత్తు కోల్పోవటం , ప్రతిపక్ష తెలుగుదేశం కొన్ని చోట్ల ధరావత్తు కోల్పోవటం ఇక్కడ మనం చర్చించుకోవాలి . అసలికి ఈ ధరావత్తు కోల్పోవటానికి ప్రధాన కారణం ఏంటి ? అనేది మనం విశ్లేషించుకుంటే తర తరాలుగా వస్తున్న ఓటు బ్యాంకు వరద వచ్చి కొట్టుకు పోయినట్టుగా కొత్త పార్టి , కొత్త నాయకత్వం వైపు మొగ్గు చూపింది . కాంగ్రెస్ కి పెట్టని కోట లాగా ఉన్న దళిత ,ముస్లిం మైనారిటీ వర్గాలు మరియు తెలుగు దేశానికి మొదటినుండి ఆయువు పట్టుగా ఉన్న BC ఓటర్లు 7 నుండి 8 శాతం తగ్గిపోవటం ఆ రెండు పార్టీలకు ధరావత్తు కోల్పోవటానికి ప్రదాన కారణం . ఈ వర్గాలకు ధరలు పెరగటం కాని , అవినీతి అక్రమాలు కానీ , జాతీయ రాజకీయ సమీకరణాలతో పనిలేదు. నమ్మకం , ఈ పార్టి నాయకత్వం లో మేము క్షేమంగా ఉండగలం అనే విశ్వాసం . ఏది ఏమి అయిన మన రాష్ట్రం లో ప్రదానం గా కాంగ్రెస్ ఇప్పుడు రెడ్డి సామాజక  వర్గం నుండి బలిజ - కాపు సామజిక వర్గం వైపునకు , తెలుగు దేశం తమ ఖమ్మ సామజిక వర్గం మరియు కొంత BC వర్గాలను , కొత్త గా ఆవిర్భవించిన వై ఎస్ ర్ కాంగ్రెస్ రెడ్డి , దళిత ,ముస్లిం, మైనారిటీ వర్గాల పార్టీల మాదిరిగా సమీకరణలు మారిపోతున్నాయి.అయితే ఇక్కడ మిగత సామజిక వర్గాలను , మరియు BJP , TRS పార్టి ల గురించి ఆలోచించాలి . BJP  కి రాష్ట్రం లో సరి అయిన నాయకత్వం లేకపోవటం వలన తమకి అనుకూలమైన వర్గాలను ఆకర్షించ లేక పోతుంది. అలాగే TRS ఒక్క ప్రాంతానికే , ఒక్క అంశానికే పరిమితి అవటం మనం ఇక్కడ గుర్తుఉంచుకోవాలి . అయితే TRS ని వెలమ సామజిక వర్గ పార్టీగా ముద్రవేయటానికి కొంతమంది ప్రయత్నించిన TRS ఆ విమర్శ నుండి సులభంగా బయట పడుతుంది .  అయితే ఈ  సమీకరణలు ముందు ముందు ఇలాగె ఉంటాయ లేదా అనేది ఆయ పార్టీల రాజకీయ సమీకరణ , వాళ్ళ యొక్క ప్రజల సంక్షేమ కార్యక్రమాల బట్టి కాలం నిర్ణయిస్తుంది .

1 కామెంట్‌:

  1. Political n Social analysis is fine, some what to cleared at the closing... for the sake of Party's as well as Voter Gods(.) Separation of Dalits n Muslims from Congress is great task for YSRCP, n BCs from TDPs attachment since 1982. Now these people wants their Identification by the Party's for their increased self respect, individuality, etc..

    రిప్లయితొలగించండి