23, జూన్ 2012, శనివారం

కుల రాక్షసి


" కులం పునాదుల పై ఈ దేశాన్ని నిర్మించలేరు" Dr  బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది అక్షరాల సత్యం. దీనికి మరో ఉదాహరనే గత వారం ఆంధ్ర ప్రదేశ్ లోని లక్షంపేట గ్రామం లో జరిగింది . కులం పేరుతొ సమాజాన్ని దారుణంగా , మానవత్వం మరచి పోయి నరికి వేసేరు ." భూమి " ఈ దేశం లో పేదవాడికి ఇంకా చెందనిది ఇంకా చెప్పాలి అంటే దళితులకు చెందనిది.

లక్షంపేట మారణ కాండ ని మనం ఏమి అని నిర్విన్చుదాం. ఇది జరిగినది ఒక్క భూమి కోసమేనా , లేక భూమి చాటున కుల వివక్షనా ! ఇది ముమ్మాటికి కుల దురహంకారమే. ఈ దురహంకారమే ఇంత మంది  ఉచకోతకు గురి అయింది. ఆనాటి కారంచేడు నుండి నేటి లక్షంపేట వరకు జరిగన మారణ కాండకు ఒక్కటే మూలం భూస్వామ్య , అగ్రకుల వ్యవస్థ . 65 years భారత చరిత్రలో కులం పేరుతొ ఇంకా వివక్ష బహుశా జాతి మొత్తం సిగ్గు పడవలిసిన విషయం . ఒక్క వైపు ప్రపంచం మొత్తం ఒక్క గ్రామం గా ఉంటుంటే ఈ దేశం మాత్రం ఇంకా కులం పునాదులపై నిర్మాణం అవుతుంది . అప్పుడు .అప్పుడు కొంతమంది సంఘ సంస్కర్తలు వచ్చిన తర తరాలు గా వచ్చిన ఈ జాడ్యం రోజు రోజుకు పెరుగుతుంది .నాపక్కన ఒక్క దళితుడు వ్యవసాయం చెయ్యకూడదు అనే సాకుతో , ఆ భూమిని తమ ఆదీనం లోకి తెచ్చుకోవటమే ఈ " నయ అగ్రవర్ణ " వ్యక్తులు మనిషిని చంపింది. అయితే మనం ఇక్కడ Dr బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాట గుర్తు తెచ్చుకోవాలి . " ఈ దేశం లో రాబోయే తరంలో అగ్రవర్ణాలు కంటే శూద్ర కులం నుండే దళితులకు పెను ప్రమాదం . బహుశా  ఇది నిజమే అవుతుంది ఇప్పుడు. అవును లక్షంపేట దళితుల మీద దాడి చేసిన వ్యక్తులు వెనకబడిన కులం వాళ్ళే, అయితే ఈ నిచ్చెన మెట్ల వ్యవస్తలో ......కాపులు తమని తాము అగ్రకులం గా అనుకుంటూ ఉంటారు . 

మనం రాజ్యాంగాన్ని నిర్మించుకున్నప్పుడు భారతదేశం ప్రజాస్వామ్య ,సోషలిస్ట్ ,లౌకిక దేశం గా చెప్పుకున్నాం. కానీ ఇంకా ఈ కుల వ్యవస్థ మన సమాజం మీద దాడి చేస్తూనే ఉంది. గుర్రం జాషువా చెప్పినట్టు ' పాముకు పాలు, చీమకు పంచదార' పెట్టి పెంచే మన ఖర్మ భూమిలో సాటి మనిషిని మనిషి గా చూడకుండా వివక్షకి , అవమానాలకు ,హత్యలకు తెగబడుతున్నారు .
ఈ అనాగరిక మారణ కాండకు ఎవరు భాద్యత వహిస్తారు ? సామాజిక న్యాయం మాకే సాద్యం అని ఉకడంపుడు ప్రసంగాలు వొట్టి నీటి రాతలేన? 

కులములోన నొకడు  గునహీనుడు నుండిన 
కులము చెడు  వాణి  గుణము  వలన  
వెలయు జేరుకునందు వెను వెడలి నట్లు 
విశ్వదాభిరామ ..వినుర వేమ.


1 కామెంట్‌:

  1. You have expressed your anguish effectively. Government still has not arrested the criminals.Andhra Pradesh Dalit Maha Sabha is demanding the criminals are to be arrested. The criminals are belonging to Kapu. The important person who led the killing of Dalits is Sri Botsa Vasudev Rao is a relative to Botsa Satya Naryana PCC President. In karamchedu Kammas, In Chuduru reddies, Now in Laksmipet Kapus caste egoism killed Dalits. Criminals have to be arrested immediately.

    రిప్లయితొలగించండి