29, జూన్ 2012, శుక్రవారం

ప్రాజెక్ట్ భూతం

చరిత్ర ఎప్పుడు అబద్దం చెప్పదు. చరిత్ర మరల , మరల రిపీట్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా నిర్వాసితులకు కలిపించాల్సిన వసతులు , వాళ్ళ హక్కులను గౌరవించాల్సిన విషయం లో ప్రభుత్వాలు ధగకోరుతనం గా నే ప్రవర్తిస్తున్నాయి . ఎవరిని మోసం చేస్తుంది ఈ ప్రజా ప్రబుత్వాలు . ప్రజలనినా లేక దేశాన్న ?


వైజాగ్ , సింహాద్రి NTPC ధర్మల్ పవర్ ప్లాంట్ అవసరాల కోసం ప్రభుత్వ హామీలను నమ్మి తమ జీవనాదారం వదులుకొని జీవిస్తున్న ప్రజలకు ప్రభుత్వాలు ఖచితంగా అంతకు మించి జీవన ఉపాది కలిపించాలి . భారత దేశం లో భూమి జీవితం ,అజీవితన్నే ప్రజా ,దేశ అభివృద్దికి ఉపయోగిస్తున్నప్పుడు అక్కడ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కలిపించాల్సిన బాద్యత ప్రభుత్వానిది , పాలితులది . భూమి , ఉపాది కోల్పోయిన ప్రజలకు ప్రభుత్వ లేక ఆయా ఖర్మగారాలలో ఉద్యోగం ఎప్పటికి సమానం కాదు ,కానీ జీవించాలి ,జీవించేందుకు మార్గం కావాలి , ఆ మార్గాన్నే ప్రజలు కోరుకుంటుంది .
మన రాష్ట్రము లో ఈ పునరావాస హామీలు అన్ని నీటి మూటలే, ఆనాటి నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం , నేటి సింహాద్రి NTPC వరకూ అంతా మోసమే . పునరావాసం పేరుతొ భలవంతపు , నిర్బంద settlements జరుతున్నాయి . ఇంకా చెప్పాలి అంటే ప్రజలు తమ సాంఘిక , సాంస్కృతిక జీవిత విదానాన్ని వదులుకొని తమ భూమిని ప్రాజెక్ట్ లకు ఇస్తున్నారు. 

భూమి కోల్పోయిన ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న ఆర్ధిక సహాయం దయతో చేస్తున్నట్టు గా ఉంది కానీ ప్రభుత్వ కనీస ధర్మం గా ఆలోచించటం లేదు . ఈ విషయం లో ప్రభుత్వం కొన్ని గ్రూప్ లుతో కుమ్మక్కు అయి ప్రజలను తమ పోలీసు బలగం తో అణిచి వేస్తున్నాయి . ప్రజలను తీవ్రవాదులుగా చూస్తున్నాయి .పాలకులు ఈ పెడదోరని వీడాలి లేకుంటే ముందు ముందు ఈ దేశం లో ఎలాంటి ప్రాజెక్ట్ వచ్చే పరిస్తితి లేదు ఇంకా చెప్పాలి అంటే అది దేశ అభివృద్ధికే ఆటంకంగా మారుతుంది .

నిన్న సింహాద్రి NTPC నిర్వాసితుల పై జరిగిన కాల్పులను ఖండిస్తూ ..ప్రబుత్వ దోరణి కి నిరసిస్తున్నాం .

28, జూన్ 2012, గురువారం

భర్త -శత్రువు లేదా స్నేహితుడు !


పెళ్లి - స్వర్గం లో నిర్ణయించ బడింది అని అనుకుంటూ ఉంటాం . ఇంకా కొంతమంది తమ భార్య , భర్త దేవుడు ఇచ్చిన వరం అనుకుంటూ ఉంటాం. 
భార్య - కుటుంబం లో ప్రదాన పాత్ర దారి !  మన భారతీయ సంస్కృతీ లో లేదా మన సమాజం లో " భర్త మాట జవదాటని స్త్రీ " అనుకోవాలి .దాదాపుగా ఇది నిజం కుడా .ఇందుకు మనకు చెప్పుకోవటానికి చాల ఉదాహరణలు ఉన్నాయి . అనాటి 'సీత' నుండి మన ఇంటిలో ముసలి జీవి మన బామ్మా గారి వరకూ ఉదాహరణలే . ఇంకా చెప్పుకోవాలి అంటే భర్త దైవం తో సమానం . ఉత్తర బారత దేశం లో ఇప్పటికి భర్త పాదాలను పూజించే స్త్రీలు ఉన్నారు .సీత భర్త మాట కాదు అనలేక అడవిలో కష్టాలు పడింది , అగ్నిగుండంలో దూకింది . వ్యసనానికి భానిస అయి కట్టుకున్న భార్యను తాకట్టు పెట్టినప్పుడు ,నిండు సభలో తల దించుకొని అవమానం పడిందే కానీ భర్త మాట వెతిరేకించలేదు . " సీత , సావిత్రి , చంద్రమతి , ద్రౌపతి ,అనసూయ " వీళ్ళు అందరు నేటి భార్యలకు ఉదాహరణలే అమ్మ - అమ్మ దగ్గరనుండి , పుస్తకాల వరకూ వీరు మన స్తీలకు ఉదహరణ లే వీళ్ళ కు మనం పెట్టుకున్న పేరు " పతివ్రతలు "

ఈ కలియుగం లో అందున ఆధునికి నవ యుగంలో భార్యలు ఇంకా భర్త మాట జవదాటడం లేదా అంటే అవును అనే చెప్పాలి . సంఘం లో గౌరవం కోసమో , సంతోష ల కోసమో , సరదాల కోసమో భర్త డబ్బులు తెస్తుంటే ఆనంద పడతారు కానీ చివరికి అతను మోసపూరితంగా డబ్బులు సంపాదించాడు అని జైలో పెట్టినప్పుడు ఆ భార్య మానసిక వేదన అతి భయంకరం . చెడు వ్యసనాలకు బానిస అయి తర తరాల ఆస్తిని పోగొట్టి , చివరికి మంగళ సూత్రం కుడా అడిగే భర్తకు మౌనం గానే తీసి  ఇచ్చే భార్య , తన క్షనికానందం కోసం వీధులు వెంట తిరిగి చివరకు అత్యంత ప్రమాదకర AIDS వ్యాదిని అంట కట్టే ప్రబుద్దులు ఉన్నారు . 
అయితే ఇందులో భార్యల భాగస్వామ్యం యెంత అనేది మనం చర్చికోవాలి . కానీ మనకు ఇక్కడ ఒక్క పెద్ద అతివాద సూక్తి ఒక్కటి ఉంది అదే బయట విషయాలు ఇంటిలో చర్చించా కూడదు . అది డబ్బుతో కూడుకున్న పని కాని ఇంకా ఎదియినా కానీ . ఈ ఒక్క సూత్రాన్ని అడ్డం పెట్టుకుని భర్త తన  పబ్బం గడుపుకుంటున్నాడు. అయితే నేను భార్యలకు చెప్పేది భర్తలను అనుమానించా మనటం లేదు గుడ్డి గా మాత్రం సపోర్ట్ చెయ్యవద్దు అంటున్న .

మనం ఇప్పుడు లోతుగా వెళ్లి చర్చించ నక్కరలేదు కాని  men prove to be very persuasive and secretive.   
A family relationship consultant quoting that “If the wife is in connivance or out of the loop, she cannot abdicate her responsibility. She should delicately put forward her misgivings and make her what to the core of her doubts.”

So the 21st century women should not be part and parcel of your husband’s ugly things.

27, జూన్ 2012, బుధవారం

నాయకుడు .


ఈ మద్య కాలం లో మన రాష్ట్రము లో ఒక్క విచిత్ర సంఘటన ఆరు నెలలకి ఒక్కసారి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులూ చలో డిల్లీ అంటూ గుంపులు గుంపులు గా వెళ్తున్నారు కొంత మంది ఎవరికి కనిపించకుండా , బహుశా బార్య పిల్లలకు కూడా చెప్పకుండా వెళ్తున్నారు అనుకుంటా ! కొంత మంది ఏమో ధూం - ధాం అంటూ ఈ రోజూ రేపో తేల్చుకొని వస్తాం అని చెప్పి డిల్లీ విమానం ఎక్కేస్తున్నారు .అసలకు ఎందుకు ఈ పరిస్తితి వస్తుంది . దీనిని ఏమైనా " డిల్లీ మానియా " అంటారా లేక ఇంకేదైనా కొత్త రకం పేరు ఏమైనా ఉందా !
సరిగ్గా ఇలాంటి పరిస్తితే అప్పుడు ఒక్క సినిమా నటుడు తెలుగు వాడి ఆత్మ గౌరవం అని ఒక్క పార్టి పెట్టి ఈ దేశం లో తెలుగు వాడికి ఒక్క గుర్తింపు తెచ్చేడు . ప్రాంతీయ పార్టీలకు ఈ దేశంలో మార్గదర్సకుడు మన తెలుగు వాడు అయ్యాడు , కానీ ఇప్పుడు మరల అదే గోల . బహుశా కాంగ్రెస్ పార్టి లక్షణం అనుకుంటా ? కానీ గత కాంగ్రెస్ (2004 to 2009 ) ప్రభుత్వ కాలం లో ఏమి జరిగిందో ఏమో కానీ ఆ యాత్రలు బహుశా లేవు అని చెప్పవచ్చు . దీని అంతటికి కారణం " లీడర్ " -  నాయకుడు లేకపోవటం .
అధినాయకత్వం ' నాయకులను ' తాయారు చెయ్యటానికి తమ శక్తి వంతం లేకుండా ప్రయత్నిస్తుంది , అరువు కూడా తెచ్చు కుంది , ప్రజలు గుర్తించటం లేదు . నాయకుడు బొమ్మ కాదు తయారు చెయ్యటానికి , నాయకుడు సహజంగా పుట్టాలి , ప్రజల హృదయ స్పందన నుండి రావాలి అప్పుడే చరిత్ర గుర్తిస్తుంది ...చనిపోయిన జనం హృదయంలో జీవిస్తూ ఉండాలి అతడే నిజమైన నాయకుడు . 



23, జూన్ 2012, శనివారం

కుల రాక్షసి


" కులం పునాదుల పై ఈ దేశాన్ని నిర్మించలేరు" Dr  బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది అక్షరాల సత్యం. దీనికి మరో ఉదాహరనే గత వారం ఆంధ్ర ప్రదేశ్ లోని లక్షంపేట గ్రామం లో జరిగింది . కులం పేరుతొ సమాజాన్ని దారుణంగా , మానవత్వం మరచి పోయి నరికి వేసేరు ." భూమి " ఈ దేశం లో పేదవాడికి ఇంకా చెందనిది ఇంకా చెప్పాలి అంటే దళితులకు చెందనిది.

లక్షంపేట మారణ కాండ ని మనం ఏమి అని నిర్విన్చుదాం. ఇది జరిగినది ఒక్క భూమి కోసమేనా , లేక భూమి చాటున కుల వివక్షనా ! ఇది ముమ్మాటికి కుల దురహంకారమే. ఈ దురహంకారమే ఇంత మంది  ఉచకోతకు గురి అయింది. ఆనాటి కారంచేడు నుండి నేటి లక్షంపేట వరకు జరిగన మారణ కాండకు ఒక్కటే మూలం భూస్వామ్య , అగ్రకుల వ్యవస్థ . 65 years భారత చరిత్రలో కులం పేరుతొ ఇంకా వివక్ష బహుశా జాతి మొత్తం సిగ్గు పడవలిసిన విషయం . ఒక్క వైపు ప్రపంచం మొత్తం ఒక్క గ్రామం గా ఉంటుంటే ఈ దేశం మాత్రం ఇంకా కులం పునాదులపై నిర్మాణం అవుతుంది . అప్పుడు .అప్పుడు కొంతమంది సంఘ సంస్కర్తలు వచ్చిన తర తరాలు గా వచ్చిన ఈ జాడ్యం రోజు రోజుకు పెరుగుతుంది .నాపక్కన ఒక్క దళితుడు వ్యవసాయం చెయ్యకూడదు అనే సాకుతో , ఆ భూమిని తమ ఆదీనం లోకి తెచ్చుకోవటమే ఈ " నయ అగ్రవర్ణ " వ్యక్తులు మనిషిని చంపింది. అయితే మనం ఇక్కడ Dr బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాట గుర్తు తెచ్చుకోవాలి . " ఈ దేశం లో రాబోయే తరంలో అగ్రవర్ణాలు కంటే శూద్ర కులం నుండే దళితులకు పెను ప్రమాదం . బహుశా  ఇది నిజమే అవుతుంది ఇప్పుడు. అవును లక్షంపేట దళితుల మీద దాడి చేసిన వ్యక్తులు వెనకబడిన కులం వాళ్ళే, అయితే ఈ నిచ్చెన మెట్ల వ్యవస్తలో ......కాపులు తమని తాము అగ్రకులం గా అనుకుంటూ ఉంటారు . 

మనం రాజ్యాంగాన్ని నిర్మించుకున్నప్పుడు భారతదేశం ప్రజాస్వామ్య ,సోషలిస్ట్ ,లౌకిక దేశం గా చెప్పుకున్నాం. కానీ ఇంకా ఈ కుల వ్యవస్థ మన సమాజం మీద దాడి చేస్తూనే ఉంది. గుర్రం జాషువా చెప్పినట్టు ' పాముకు పాలు, చీమకు పంచదార' పెట్టి పెంచే మన ఖర్మ భూమిలో సాటి మనిషిని మనిషి గా చూడకుండా వివక్షకి , అవమానాలకు ,హత్యలకు తెగబడుతున్నారు .
ఈ అనాగరిక మారణ కాండకు ఎవరు భాద్యత వహిస్తారు ? సామాజిక న్యాయం మాకే సాద్యం అని ఉకడంపుడు ప్రసంగాలు వొట్టి నీటి రాతలేన? 

కులములోన నొకడు  గునహీనుడు నుండిన 
కులము చెడు  వాణి  గుణము  వలన  
వెలయు జేరుకునందు వెను వెడలి నట్లు 
విశ్వదాభిరామ ..వినుర వేమ.


17, జూన్ 2012, ఆదివారం

రాజకీయ - సామజిక సమీకరణలు.- ఆంధ్రప్రదేశ్


ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కొత్త రాజకీయ సమీకరణాలకు వేదిక కాబోతుంది. ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం ప్రక్యాత సినిమా నటుడు NT రామారావు తెలుగు దేశం పార్టి ఆవిర్భవించినప్పుడు ఒక్క క్రొత్త రాజకీయ వరవడిని సృష్టించి వెనకబడిన వర్గాలను తమ వైపుకు తిప్పుకుని ఈ రాష్ట్రంలో ఒక్క పెను ప్రభంజనం సృష్టించింది . పేరుకు తెలుగు వాడి ఆత్మగౌరవం తో ఏర్పడిన దాని మూలం మాత్రం సామజిక కుల సమీకరణము మాత్రమే . ఆనాటి నుండి నేటి వరకు అవర్గము అది తమ సొంత పార్టి గా అనుకుంటూ వచ్చారు . వెనకబడిన తరగతులను ప్రోస్తాహించటం వలన ఆపార్టి మనుగడ సాధిస్తూ వస్తుంది . ఇదేసందర్బం లో జాతీయ కాంగ్రెస్ ఆంద్ర రాష్ట్రం లో రెడ్డి సామజిక వర్గం నాయకత్వం లో మిగత దళిత ,ముస్లిం కులాలు తమ పార్టీగా చెప్పుకుంటూ వస్తున్నారు .
అయితే ఇటీవల కాలం లో Dr వై ఎస్ రాజశేకర్ రెడ్డి ముక్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కాలంలో చాల వర్గాలకు తను వ్యక్తి గతంగా చాల దగ్గర అయ్యేడు . అతినిని ప్రజలు అక్కున చేర్చుకున్నారు. అయితే రాజశేకర్ రెడ్డి గారు అకాల మరణం తరువాత ఈ రాష్ట్రం లో రాజకీయ ,సమజకంగా పెను మార్పులు సంభవించాయి. రాజశేకర్ రెడ్డి తనయుడు వివిధ కారణాలన కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి సొంతగా పార్టి స్తాపించటం , రాజశేకర్ రెడ్డి ని అభిమానించే కొంతమంది MLA లు ఆ పార్టికి మద్దతు ఇవ్వటం ,అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టి కి వెతిరేకంగా అవిస్వాసతీర్మానానికి మద్దతు పలకటం , తమ అధికారం కోల్పోయి మరల వై ఎస్ జగన్ స్తాపించిన వై ఎస్ ర్ కాంగ్రెస్ పార్టి నుండి ఎన్నికలకు వెళ్ళటం మనకు తెలిసిందే. అయితే ఈ ఎన్నికల లో ఒక్క గొప్ప మార్పుని మనం గమనించాలి. మొత్తం 18 అసెంబ్లీ , ఒక్క పార్లమెంట్ నియోజకవర్గం లో అధికార కాంగ్రెస్ పార్టికి 5 స్తానలలో ధరావత్తు కోల్పోవటం , ప్రతిపక్ష తెలుగుదేశం కొన్ని చోట్ల ధరావత్తు కోల్పోవటం ఇక్కడ మనం చర్చించుకోవాలి . అసలికి ఈ ధరావత్తు కోల్పోవటానికి ప్రధాన కారణం ఏంటి ? అనేది మనం విశ్లేషించుకుంటే తర తరాలుగా వస్తున్న ఓటు బ్యాంకు వరద వచ్చి కొట్టుకు పోయినట్టుగా కొత్త పార్టి , కొత్త నాయకత్వం వైపు మొగ్గు చూపింది . కాంగ్రెస్ కి పెట్టని కోట లాగా ఉన్న దళిత ,ముస్లిం మైనారిటీ వర్గాలు మరియు తెలుగు దేశానికి మొదటినుండి ఆయువు పట్టుగా ఉన్న BC ఓటర్లు 7 నుండి 8 శాతం తగ్గిపోవటం ఆ రెండు పార్టీలకు ధరావత్తు కోల్పోవటానికి ప్రదాన కారణం . ఈ వర్గాలకు ధరలు పెరగటం కాని , అవినీతి అక్రమాలు కానీ , జాతీయ రాజకీయ సమీకరణాలతో పనిలేదు. నమ్మకం , ఈ పార్టి నాయకత్వం లో మేము క్షేమంగా ఉండగలం అనే విశ్వాసం . ఏది ఏమి అయిన మన రాష్ట్రం లో ప్రదానం గా కాంగ్రెస్ ఇప్పుడు రెడ్డి సామాజక  వర్గం నుండి బలిజ - కాపు సామజిక వర్గం వైపునకు , తెలుగు దేశం తమ ఖమ్మ సామజిక వర్గం మరియు కొంత BC వర్గాలను , కొత్త గా ఆవిర్భవించిన వై ఎస్ ర్ కాంగ్రెస్ రెడ్డి , దళిత ,ముస్లిం, మైనారిటీ వర్గాల పార్టీల మాదిరిగా సమీకరణలు మారిపోతున్నాయి.అయితే ఇక్కడ మిగత సామజిక వర్గాలను , మరియు BJP , TRS పార్టి ల గురించి ఆలోచించాలి . BJP  కి రాష్ట్రం లో సరి అయిన నాయకత్వం లేకపోవటం వలన తమకి అనుకూలమైన వర్గాలను ఆకర్షించ లేక పోతుంది. అలాగే TRS ఒక్క ప్రాంతానికే , ఒక్క అంశానికే పరిమితి అవటం మనం ఇక్కడ గుర్తుఉంచుకోవాలి . అయితే TRS ని వెలమ సామజిక వర్గ పార్టీగా ముద్రవేయటానికి కొంతమంది ప్రయత్నించిన TRS ఆ విమర్శ నుండి సులభంగా బయట పడుతుంది .  అయితే ఈ  సమీకరణలు ముందు ముందు ఇలాగె ఉంటాయ లేదా అనేది ఆయ పార్టీల రాజకీయ సమీకరణ , వాళ్ళ యొక్క ప్రజల సంక్షేమ కార్యక్రమాల బట్టి కాలం నిర్ణయిస్తుంది .