28, డిసెంబర్ 2015, సోమవారం

తన కవల సోదరుడిని 36 ఏళ్ళు కడుపులో దాచుకున్న వ్యక్తి !

కడుపులో ఏకంగా తన కవలసోదరున్ని దాచుకున్నాడు సంజు భగత్ అనే ఒక వ్యక్తి. నాగపూర్ లో నివసించే సంజు భగత్ కి ముందు నుండి కడుపు కాస్త పెద్దదిగా ఉండేది ఎలా అంటే 9 నెలల గర్భిణికి ఉన్నట్లు. రైతైన భగత్ కు అప్పుడప్పుడు ఊపిరి పీల్చుకోవడం కూడా ఇబ్బందిగా ఉండేది. కడుపులో ఏదో కణితి పెరుగుతోంది అని అనుకున్నారు, కానీ..!
1999 జూన్ నెలలో ఒక రోజు సంజూ స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే అతన్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకు వెళ్ళారు. అక్కడ ఉన్న డాక్టర్లు కూడా ఈ 36 ఏళ్ల వ్యక్తి కడుపులో ఏదో పెద్ద కణితి ఉందని అనుకున్నారు. అందువల్ల వాళ్ళు సర్జరీ చేసి ఆ కణితిని తీసేద్దామని ఆపరేషన్ మొదలుపెట్టారు. హాస్పిటల్ లోని వైద్యులు కణితి పెద్దది అవడం వలన అతనికి ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు అని అనుకున్నారు. అయితే ఆపరేషన్ మొదలు పెట్టగానే ఆతని కడుపులో ఉన్నది చూసి నివ్వెరపోవడం డాక్టర్ల వంతైంది.

డాక్టర్లు ఆపరేషన్ మొదలు పెట్టగానే ట్యూమర్ ఎలాంటిదో గుర్తుపట్టేస్తారు.. అయితే భగత్ విషయంలో ఆ పరిస్థితి వేరేగా ఉంది. కత్తి పెట్టగానే చాలా ఎక్కువ మొత్తంలో రక్తం బయటకి వచ్చింది. అంతే కాకుండా ఒక అవయం తర్వాత మరో అవయవం ఇలా ఒక మనిషి శరీరంలో ఉన్న అంగాలు బయటకు రాసాగాయి అప్పటికి కాని వారికి తెలియలేదు భగత్ కడుపులో ఉన్నది కణితి కాదు ఒక మనిషి శరీరం అని. ఒక మనిషి శరీరం సగం వరకు భగత్ కడుపులో పెరిగిపోయింది. వెంటనే వైద్యులు సర్జరీ చేసి కడుపులో ఉన్న దాన్ని తీసివేసారు. భగత్ కడుపులో ఉన్నప్పుడు వారి తల్లి కవల పిల్లల్ని కడుపులో ఉంచుకుంది కాని కొన్ని కారణాల వలన భగత్ గర్భంలో ఉన్నప్పుడు మరో బిడ్డ భగత్ గర్భంలో రూపాంతరం చెందింది. ఇలాంటి సమయాల్లో పుట్టగానే చనిపోవాల్సింది కాని భగత్ ఎలాగో బ్రతికి బయటపడ్డాడు అని అక్కడి డాక్టర్లు తెలిపారు. చాలా తక్కువ శాతంలో ఇలా పెరుగుతారు అని అన్నారు. ఇలా బ్రతికిన భగత్ ఇన్ని రోజులుగా కడుపులో కణితి పెరుగుతోంది అని అనుకున్నాడే కానీ కడుపులో తన సోదరున్ని మోస్తున్నా అని అనుకోలేదు. ఎలాగోలా ఆపరేషన్ సక్సెస్ అయ్యి బ్రతకగాలిగాడు. అయినా 36 సంవత్సరాలపాటు తన కవల సోదరున్ని కడుపులో మోసిన మొదటి వ్యకిగా భగత్ చరిత్రలోకి ఎక్కాడు..

చికాగో లో 20 మంది తెలుగు విద్యార్ధులు అడ్డగింత

అమెరికా లో చదువుకుంటానికి వెళ్ళిన తెలుగు విధ్యార్ధులను సరైన పత్రాలు మరియు కారణాలు చెప్పలేదు అంటూ చికాగో విమానాశ్రయం నుండి ఆ దేశ ఇమ్మిగ్రేషన్ అధికారులు తిప్పి పంపేరు. వీరంతా హైదరాబాద్ కు చెందిన ఒక ఏజెంట్ ద్వారా చదువు కోసం అంటూ విమానం ఎక్కేరు. 

వివరాలలోకి వెళితే గత వారం నుండి అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు 100 కు పైగా తెలుగు విధ్యార్ధులను సరైన కారణాలు అమెరికా లో చదువుకోవటానికి , నివసించటానికి అంటూ తిప్పిపంపేరు. ఆ విద్యార్ధులకు అమెరికా లో చదువుకోవటానికి సరైన సామర్ధ్యం లేదు అని నిర్ధారిస్తున్నారు. 
ఇది ఇలా ఉంటే చాల మంది విద్యార్ధులు అధికారులు అడిగిన ప్రశ్నకు నిర్లక్షదొరనితో సమాదానం చెప్పటం అమెరికా అధికారులను విస్మయానికి గురిచేసింది. FBI సమాచారం ప్రకారం విద్యార్ధుల నెపం తో ఇక్కడ పని చేసుకుంటూ ఉండిపోవటానికే వీరు వచ్చినట్టు వీరికి అంతగా సామర్ధ్యం లేనట్టుచెబుతున్నారు 



25, డిసెంబర్ 2015, శుక్రవారం

గుంటూరు వృక్ష జాతులు

ఆంధ్ర ప్రదేశ్లోని గుంటూరు నగరం యొక్క వృక్ష జాతులు పేరుతో పుస్తకం రచించిన పిఆర్ మోహన్ రావు

పిఆర్ మోహన్ రావు ఆంధ్ర ప్రదేశ్లోని గుంటూరు నగరం యొక్క వృక్ష జాతులు పేరుతో ఒక పుస్తకం రచించారు. గుంటూరు నగరంలో గల వృక్ష సంపదను గురించి రచయుత ఈ గ్రంధంలో సమగ్రంగా వివరించారు.ఇది గుంటూరులోని అనేక జాతుల మొక్కలు మరియు చెట్లును గురించి అందుబాటులో ఉన్న మరియు ప్రామాణికమైన గ్రంధం.
76 ఆవృత బీజ కుటుంబాలకు చెందిన 431 పుష్పించే మొక్కలు, పొదలు మరియు చెట్లకు సంబంధించిన సమాచారం ఈ పుస్తకంలో లభిస్తుంది. బెన్థం మరియు హుకర్ విధానం యొక్క వర్గీకరణ ఆధారంగా మొక్కలు, పొదలు మరియు చెట్లు కుటుంబాలను క్రమపద్ధతిలో ఏర్పాటు చేశారు.

మోహన రావు గురించి
మోహన రావు ఒక పదవీవిరమణ పొందిన ప్రొఫెసర్ మరియు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఎఎన్ యు) లో బోటనీ శాఖ మాజీ అధిపతి (.హెచ్ఒడి). ఈ పుస్తకం రాస్తున్న సమయంలో ఈయనకి, ఎఎన్ యు అసిస్టంట్ బోటనీ ప్రొఫెసర్ ఎస్ కె ఖాసిమ్ మరియు మాజీ పరిశోధన విద్యార్థి బీబీ ఆసియా సహకరించారు. వీరిద్దరూ డెహ్రా డన్ నుండి బిషన్ సింగ్ మహేంద్ర పల్ సింగ్ ప్రచురించిన ఈ పుస్తకానికి సహ-రచయితలుగా ఉన్నారు.

22, డిసెంబర్ 2015, మంగళవారం

హలచల్ చేస్తున్న " జల కన్య "

తెలుగు జానపద కథలలో మనం విన్నాం జలకన్య గురించి బ్లాక్ & వైట్ సినిమాలో ఆ మధ్య ధర్సకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా పొడుగు కాళ్ళ సుందరి శిల్ప శెట్టి తో జలకన్య సినిమా తీసేరు. సగం మనిషి సగం చేపను పోలిన ఈ జలకన్య ఇంగ్లీష్ వాళ్ళు ముద్దు గా మేర్మయిడ్ అని పిలుచుకునే ఈ కన్య అసలు ఉందో లేదో కూడా తెలియదు. ఆమె చుట్టూ ఎన్నో కథలు. 
అయితే ఆ జలకన్య అసలు వీడియో మా వద్ద ఉంది అంటూ యు టూబ్ లో పెట్టేరు. అసలే జల కన్య ఇంకేముంది నవంబర్ 24 తేదిన యు టూబ్ లో పెట్టేసరికి నెల తిరిగే లోపల 3.12 కోట్ల మంది ఆ విడియో ని చూసేరు , షేర్ చేసేరు. తీర ఆ వీడియో పూర్తి అయ్యేసరికి అసలు విషయం తెలుసుకుని జనం అవాక్ అయ్యేరు. 
ఉత్సాహం మరియు పకృతి ప్రేమికులు ప్రస్తుతం మన భూగోళం లో జరుగుతున్నవాతావరణ మార్పులు గురించి ప్రజలను చైతన్య పరచటానికి ఆ విడియో ని పోస్ట్ చేసేరు. "ప్రస్తుతం జల కాలుష్యం , లేదా వాతావరణ కాలుష్యం ఇలాగే ఉంటే కొన్ని రోజులకు సముద్రం లోని చేపలు ఇలా వింత జంతువులాగా మారుతుంది" అంటూ చివరిగా సందేశం ఇచ్చేరు ఆ వీడియో లో. జలకన్య ని చూద్దాం అని ఆశగా వీడియో ని క్లిక్ చేసిన ప్రజలకు నిరాస కలిగిన వాతావరణ కాలుష్యం గురించి కాస్త ఆలోచించే విధంగా చేసింది 






20, డిసెంబర్ 2015, ఆదివారం

నేషనల్ హెరాల్డ్



ఇప్పుడు అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు.కొన్ని గంటల క్రితం బారతీయ మీడియా లో ఇదే చర్చ , ఎవరినోట విన్నా "నేషనల్ హెరాల్డ్ "
అసలు ఎవరీ నేషనల్ హెరాల్డ్? ఎందుకు బారతీయులు అంత గా దీని మీద చర్చిస్తున్నారు.?
అది స్వతంత్ర పోరాటం ఉదృతంగా జరుగుతున్నా కాలం. ఆరోజుల్లో పత్రిక ఆవశ్యకత గుర్తించి జవహర్ లాల్ నెహ్రు సెప్టంబర్ 9, 1938 లక్నో లో  దీనిని స్తాపించేరు. నెహ్రు ప్రదాని అయ్యేంతవరకు ఆయనే పత్రిక ఎడిటర్ గా పనిచేసేరు. ఆ తరవాత కె. రామా రావు కి ఎడిటర్ గా బాద్యతలు అప్పగించేరు. ఆగస్ట్ 1942, క్విట్ ఇండియా రిజల్యుషన్ వలన బ్రిటిష్ ప్రబుత్వం మొదటి సారిగా 1942 - 1945 పత్రికకు తాళం వేసేరు. 1945 లో మళ్ళీ ఇందిరాగాంధీ బర్త ఫిరోజ్ గాంధీ మేనేజింగ్ డైరెక్టర్ గా తిరిగి ప్రరంబించేరు. ఫిరోజ్ గాంధీ  సారధ్యం లో 1950 వరకు పత్రిక పనిచేసింది. ఇదే సమయం లో పత్రిక కొంత ఆస్తులను కూడా బెట్టుకుంది.1946 నుండి 1978 వరకూ మనికొండ చలపతి రావు పత్రికకు ఎడిటర్ గా పనిచేసేరు. ఆ సమయం లో నెహ్రు చలపతి రావు కి పూర్తి స్వేచ్ఛను ఇచ్చేరు. కొన్ని రోజులు నెహ్రు అంతర్జాతీయ వార్త సేకరణదారుడు గా పనిచేసేరు. 

నేషనల్ హెరాల్డ్ కాంగ్రెస్ కి మౌత్ పీస్ గా పనిచేస్తూ ఉండేది. శ్రీమతి ఇందిరా గాంధీ సమయం లో పత్రిక రెండుసార్లు ముసివేసేరు. 1977 లో ఇందిరా గాంధీ ఓడిపోయినప్పుడు , మరియు ఎమర్జన్సీ సమయం లో. 1986 లో మళ్ళీ మూసి వేసే స్తితికి వెళ్ళినప్పుడు రాజీవ్ గాంధీ దీనికి కొంచెం ఆర్ధిక పరిపుష్టి కల్గించెరు. 1998 లో లక్నో ఎడిషన్ ముసివేసేరు అప్పుడు కొన్ని ఆస్తులు అమ్మి అప్పులు తీర్చేరు. అయితే 2008 లో " నేషనల్ హెరాల్డ్ " ని శాస్వితంగా సోనియా గాంధీ , రాజీవ్ గాంధీ సారధ్యం లో ముసివేసేరు. 
అయితే అసలు వివాదం ఏంటి ? ఎందుకు ఇప్పుడు ఇది ప్రజల్లో చర్చనీయాంశం అయ్యింది. 
125 సంవత్సరాల కాంగ్రెస్ -నెహ్రు - గాంధీ చరిత్రలో కాంగ్రెస్ రధసారదులు మొదటి సారిగా కోర్టు మెట్లు ఎక్కటమే ఇప్పుడు ఇది ప్రజల లలో చర్చనీయాంశం అయ్యింది. అసలు ఇందులో వివాదం ఎక్కడ మొదలైంది? ఎందుకు సోనియా , రాహుల్ గాంధీ లు కోర్టు మెట్లు ఎక్కేరు ? 
నేషనల్ హెరాల్డ్ Associated Journal Ltd ( AJL ) అనే సంస్త కింద పని చేస్తూ ఉంటుంది ఇందులో మెజారిటీ షేర్ హోల్డర్స్ అంతా కాంగ్రెస్ నాయకులే. అయితే రూ 5000 కోట్లు ఆస్తులు కలిగిన నేషనల్ హెరాల్డ్ ని సోనియా , రాహుల గాంధీ నేతృత్వం వహిస్తున్న Young India Limited కారుచౌకగా రూ 50 లక్షలే చెల్లించి సొంతం చేసుకుంది ఇందులో మనీ లాండరింగ్ జరిగినట్టు బాజాపా నాయకుడు ఒకప్పటి జనతా పార్టి అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం స్వామి కేసు పెట్టి విచారిన జరపాల్సిందిగా కోరేరు. ఇదే కేసులో కొన్ని గంటలు క్రితం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ , ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాటియాలా కోర్టు మెట్లు ఎక్కేరు. దేశ ప్రజలంతా ఊపిరి బిగపట్టి కోర్టు నిర్ణయం కోసం చూసేరు. అయితే వుహించినట్టే కోర్టు సోనియా గాంధీ , రాహుల్ గాంధీ కి బెయిల్ ఇచ్చేరు. 

కాంగ్రెస్ పార్టి కి కాని , నెహ్రు - గాంధీ కుటుంబానికి కాని ఇది పెద్ద గుణపాటం గా మెజారిటీ ప్రజల అభిప్రాయం. కోర్టు నిర్ణయం వరకూ పెద్దగా
కాంగ్రెస్ మీద జాలి కలగ లేదు. అయితే ఈ సంఘటన ను కాంగ్రెస్ కాని గాంధీ - నెహ్రు కుటుంబం తమకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం లో కొంత సఫలీకృతం అయ్యేరు అని చెప్పవచ్చు. కోర్టు నుండి  నేరుగా పార్టి ఆఫీసు కు చేరుకున్న అమ్మ - కొడుకు మరియు యావత్ కాంగ్రెస్ పెద్దలు మీడియా తో మాట్లాడుతూ " న్యాయవ్యవస్త మీద నమ్మకం ఉంది , బారతీయులుగా మేము బారత్ న్యాయవస్తను గౌరవించి కోర్టుకు వెళ్లేము " అని తమ వాదన కాస్త గట్టిగా చెప్పే ప్రయత్నం చేసేరు. ఇదే సందర్భం లో కేంద్రం లోని బాజపా పార్టి రాజకీయ కక్షసాధింపు చర్యలు చేస్తుంది అంటూ సోనియా గాంధీ పేర్కొన్నారు. 
సోనియా గాంధీ , రాహుల్ గాంధీలు విదేశాలకు పారిపోకుండా , వాళ్ళ పాస్ పోర్ట్ ని జప్తు చెయ్యాలి , వారికి కోర్టు దేశం విడిచి వేల్లరాడు అని డా సుబ్రహ్మణ్యం స్వామి  కోర్టు వారిని కోరినప్పుడు పటియాల కోర్టు కాంగ్రెస్ కు  కాని, సోనియా , రాహుల్ గాంధీ లకు చరిత్ర ఉంది వాళ్ళు దేశం విడిచి పారిపోతారు అనుకోవటం లేదు అంటూ కోర్టు పేర్కొనటం విశేషం.