11, జులై 2012, బుధవారం

ఓట్ల " విభజన "

ఆంద్ర ప్రదేశ్ ఎలా ఆవిర్భవించిందో మన అందరికీ బాగా తెలుసు దానిగురించి మనం చర్చించుకోవటం పెద్దగా అవసరం కూడా లేదు. అయితే ఇక్కడ మనం ఒక్కవిషయం గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటం  ఇంకొక కారణం. ప్రస్తుతం మన రాష్ట్రము లో గత 12 యేండ్లనుండి రాష్ట్రాన్ని రెండుగా చెయ్యాలి అని ఒక్క ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకులు పోరాటం చేస్తున్నారు .రాష్ట్రాన్ని విడతీయాలి , లేదు సమైక్యంగా ఉంచాలి అనేది పక్కన పెడితే ఈ విభజన వలన ఏ రాజకీయ పార్టికి ఎక్కువ ఓట్లు వస్తాయి , ఏ పార్టి అధికారం లోకి వస్తుంది అనేది ప్రదానమైన సమస్య . ఆ ప్రాంత ప్రజల అభిప్రాయాలను కాకుండా రాజకీయ పార్టీల భవిషత్ గురించి చర్చించుకోవటం విడ్డురం . కాంగ్రెస్ కి లాభమా , తే రా స కి లాభమా అని చర్చలు జరపటం బాధాకరం .వై ఎస్ ర్ కాంగ్రెస్ పార్టి గెలుపు ఆపాలి అంటే రాష్ట్ర విభజన చెయ్యాలి ,ఆ పార్టీని ఆవిధంగా అడ్డుకోవాలి అని కుడా చర్చలు జరుగుతున్నాయి 


2014 లో రాహుల్ గాంధీ ప్రదాని కావాలి అంటే తెలంగాణా ని విభాజించాలా? తే ర స  ని కాంగ్రెస్ పార్టీలో కలుపుకొని రాష్ట్రాన్ని విభజిస్తే మెజారిటి MP స్తానాలు కాంగ్రీస్ వి అప్పుడు రాహుల్ గాంధీ ప్రదాని కావటానికి మెజారిటి స్తానాలు కాంగ్రెస్ కి సరిపోతాయి అనే తప్పా అసలకి ఒక్క రాష్ట్రాన్ని ఏ సిద్దాంతం మీద విభజించాలి , రాష్ట్రాల ప్రయోజనాలు ,ఆయా ప్రాంతాల ప్రజల అవసరం ఏమిటి ,దేశ సమగ్రత ,దేశం లో జరిగే పరిణామాలు ఏంటి అనేవి పాలకులు కాని ,మిగత రాజకీయ పార్టిలు కానీ ఆలోచించటం లేదు , వాళ్ళ రాజకీయ భవిషత్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు .


మన రాష్ట్రము లో రెండో అతిపెద్ద విభజన సమస్య SC వర్గీకరణ ఇది ఒక్క రాష్ట్ర సమస్య కాదు దేశం మొత్తానికి సంబందినిచినది అసలకు ఇది రాష్ట్రాలతో సంబంధం లేని సమస్య కానీ రాజకీయ పార్టిలు వాళ్ళ అవసరాలకోసం ఇలాంటి విభజనలు మన ముందుకు తీసుకు వస్తున్నారు . ఈ మద్య ఒక్క పార్టి విస్త్రుతస్తాయి సమావేశం లో 2014 లో ఆ పార్టి గెలుపుకోసం దీనిని కూడా తమ ఎజండా లో ప్రదాన పదకం గా పెట్టుకున్నారు . 



రాజకీయ పార్టిలు వాళ్ళ అవసరాలకోసం , ఓట్లకోసం ,సీట్ల కోసం ఇలాగ మనుషులు మద్య ,ప్రాంతాల మద్య ,కులాల మద్య విభజన రేఖ గీస్తున్నారు . ఎప్పుడో బ్రిటిష్ వాడు వదిలి వెళ్ళిన విభజించు పాలించు అనే రాజనీతి సూత్రాన్ని ఇప్పుడు మనవాళ్ళు , మన ప్రజల మీద ప్రయోగిస్తున్నారు . ఇంకొక ఆచర్యకరమైన విషయం ఏంటంటే అన్ని పార్టీలలో రెండు గ్రూపులు ఒకరు వెతిరేకిస్తారు ,ఇంకొకరు సమర్దిస్తారు ఆ పార్టి అధినాయకత్వం ఏమి అనదు. అంటే పార్టీల , వ్యక్తుల స్వలాభం కోసమే ఈ విభజన?  వీళ్ళకు మేధావి అనే ఇంకొక వర్గం వత్తాసు పలుకుతూ ఉంటుంది . 



ప్రభుత్వాలు ఓట్ల కోసం కాకుండా ప్రజల , దేశ అవసరాలకోసం , ప్రజల జీవిత ప్రమానాలకోసం రాష్ట్రాలను కానీ ,ప్రజలను కానీ విభజిస్తే మంచిదే , ఆ పేరుతొ ప్రాంతాలతో , ప్రజలతో ,తమ తమ వ్యక్తిగత ,రాజకీయ అవసరాలకోసం విభజిస్తే సమాజం ఒప్పుకోదు...చరిత్రలో స్తానం ఉండదు .






6 కామెంట్‌లు:

  1. Dear Brother! very useful submission to readers as well as social activists.."there is no permanent enemy...friendship...among them, permanent gains are their aims" thus earlier spoken by Babasaheb Dr B R Ambedkar. Divisions are for their sake only not of the people of any region.... awaiting more n more like viz... kchpraj@gmail.com (09441077333)

    రిప్లయితొలగించండి
  2. @chinna Peddiraju : Thank you Mr. Peddi raju garu. Your comment helps me to write more. If any thing mistake please feel free to write. Thanks again

    రిప్లయితొలగించండి
  3. Mee alochanalu chala bagunnayi......rajakiyalu rajakeeya labdi kosam chesevi rajakeeya labdi pondutunnaru antene adi development ki nosukoledu ani cheppeya vachu....prati otaru itu vanti rajakeeyalu chese vallani road la meeda tiruganeeyakudadu..

    రిప్లయితొలగించండి
  4. naayakulu niyamaalanu,6suthraala pathakam,610 G.O,neella lo,nidhula lo telangaana vaataa,pedda manushula oppandam nu paatisthe...ee roju ee vibhajana samasya vachhi undedi kaadu...adhikaaram,anga balam undanna balupu tho balheenula meeda daadi cheste ilaanti samasyale vasthai....

    రిప్లయితొలగించండి