6, జనవరి 2016, బుధవారం

పినాకిని ఎక్స్ ప్రెస్ 12711; దేవుడా నేను మాత్రమే బాగుండాలి!

పినాకిని ఎక్స్ ప్రెస్ 12711; దేవుడా నేను మాత్రమే బాగుండాలి

ఉదయం 8:20 నిముషాలు...,
పినాకిని ఎక్స్ ప్రెస్ ఆలస్యంగా నడుస్తుంది. మంచు దుప్పటిని చీల్చుకుంటూ వేగంగా పరుగులు తీస్తుంది చెన్నై వైపు. నేను అందులో ప్రయాణిస్తున్న సి 1 - 46 నా సీట్ . సహజంగా ఏ సి కోచ్ లో చాల గంభీరంగా వుంటుంది. ఆరోజు ఎందుకో లోనకి అడుగుపెట్టేసరికి కొంచం సందడి అనిపించింది. ప్రయాణికులు తమ సీట్స్ లో కుర్చున్నతరువాత నిశబ్దంగా ఉంటుంది అని మనసులో అనుకున్న. నా పక్కన ఇద్దురు సేనియర్ సిటిజన్స్ బార్య , భర్త , వాళ్లతో పాటు ఇంకో మూడు కుటుంబాలు వాళ్ళు సేనియర్ సిటిజన్స్ నే. ఏంటో ఈ రోజు ముసలి వాళ్ళే అందరూ అనుకున్న. ఇంతలో ఒక నెలలు నిండని బేబి ఏడుపు మొదలైంది, ఏ సి కోచ్ లో బయట శబ్దం , రైలు శబ్దం వినపడదు కాబట్టి ఆ బేబి ఏడుపు చాల బాగా వినిపిస్తుంది. ఆ తల్లి ఏడుపు ఆపటానికి ప్రయత్నించి చివరకు సఫలీకృతం అయ్యింది.
ఇది అంతా ఎందుకు చెబుతున్నాను అంటే తరచూ ప్రయాణించే నాకు ఆరోజు నాతో పాటు ప్రయాణించే మిగతా ప్రయాణికుల ఇబ్బందిని తెలియపరచటానికి.
మనం సమజం లో ఉన్నప్పుడు కొద్దో గొప్పో స్పృహ ఉండాలి. మన వలన పక్కన వారికి ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా అని. నెలలు నిండని ఒక చిన్న బేబి ఏడుస్తుంటే ఎక్కడ సాటి ప్రయాణికులకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని ఆ తల్లి ఆ ఏడుపు ఆపటానికి ప్రయత్నించిందో, వయసులో పెద్ద వాళ్ళు నలుగురికి చెప్పే స్తితిలో ఉన్న వాళ్ళకి ఆ స్పృహ లేకపోయింది.
అప్పటికే రైలు అరగంట ప్రయాణించింది. ఆలస్యం అవటం వలన అనుకుంటా కొంచం వేగం పెరిగింది. నేను మొదట చెప్పినట్టు నా పక్కన సేనియర్ సిటిజన్స్ వాళ్ళ ఆరోగ్య సమస్యలు మనకు తెలిసిందే టాబ్లెట్స్ వేసుకుంటున్నారు , వాళ్ళ తో పాటు మిగతా సేనియర్స్ కూడా. ఉదయం కావటం వలన అందరు సమయం పాటిస్తున్నారు. ఈ రోజు ఏంటో నాకు కొత్తగా అనిపించి మనసులోనే నవ్వుకుని తోటి ప్రయాణికుడి వద్ద తెలుగు పేపర్ ఉంటే తీసుకుని చదువుతున్న.
ఇంతలో మా వెనక కూర్చున్న వాళ్ళ లో కదలికి మొదలు అయింది. వాళ్ళ పరిస్తితి చూస్తే పుణ్య క్షేత్రాలు దర్శించటానికి వెళ్తున్నారు. అందరూ మహిళలే , వాళ్లతో పాటు ఇద్దరు పిల్లలు. వాళ్ళ పర్యవేక్షకుడు డబ్బులు వసూళ్ళు చేస్తున్నాడు. ఇంకో కోచ్ లో ఇంకొందరు ఉన్నట్టు అర్ధం అయింది. వాళ్లతో పాటు ప్రయాణించే పిల్ల వాడు మొదలు పెట్టేడు అంకెలు లెక్క పెట్టడడం . పిల్లవాడు అయినా కొంచం పెద్ద గొంతునే. నేను ఏదో సరదా అనుకున్న.... వేలం పాట లాగా అరుస్తున్నాడు, వాడికి మిగతా వాళ్ళు సహకరిస్తున్నారు. బహుసా తంబోలా ఆట అనుకుంటా. ఇంతలో నా ముందు ఉన్న పెద్ద ఆవిడ బాబు అరవకు అని చెప్పేరు. వినలేదు .... నాకు చిరాకు అనిపించింది. పెద్ద వయసులో ఉన్న వారు కొంచం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అయినా వాళ్ళు ఆడుకుంటూ నే ఉన్నారు. కొన్ని నిమషాలు తరవాత నా పక్కన ఉన్న పెద్ద ఆవిడకు వాళ్ళు పిల్లలు నుండి ఫోన్ వచ్చింది ఆవిడ మాట్లాడుతూ బాబు అరవకు ఫోన్ వినిపించటం లేదు అని చెబుతున్నారు. అయినా ఆ పిల్ల వాడు కాదు కదా వాడి తల్లులు కూడా వినటం లేదు. రెండు మూడు సార్లు చెప్పి ఆవిడ ఫోన్ మాట్లాడటం ఆపెసేరు. పిల్ల వాడికి బుద్ది లేక పొతే పెద్దలకు కూడా లేదా , ఫోన్ వినపడటం లేదు , అంతకు ముందు కూడా ఇంకొక పెద్ద ఆమె చెప్పేరు అయినా ఏంటి గలబా అన్నారు నేను పేపర్ చేతిలో పట్టుకున్నాను కాని చదవలేదు ఆమే బాదను గమనించటమే సరిపోయింది. రెండు మూడు నిముషాలు అయిన తరవాత నేను చెప్పెను ఆ పిల్ల వాడికి. ఇంతలో ఆట అయిపోవటం వలన వాళ్ళు ఆపేరు. కొందరు ఆడదాం అంటారు.
అప్పటికే రైలు బిట్రగుంట దాటేసింది. రైలు డ్రైవర్ ఎలాగో సమయాన్ని సరిచేసేడు. ట్రైన్ అనుకున్న సమయానికే పరుగులు పెడుతుంది. మంచు కరిగిపోయి సూర్యుడు కనిపిస్తున్నాడు. సమయం 9:30 కావొస్తుంది.
పక్క వాళ్ళ ఇబ్బంది ని గమనించకుండా అలా ఇబ్బందులకు గురిచెయ్యటం బహుసా వాళ్ళకు తప్పు అనిపించదు.
దేవుడా నేను బాగుండాలి,
దేవుడా నేను మాత్రమే బాగుండాలి
అనుకునే సాటి ప్రజలు ఉన్నంత వరకూ అప్పుడు అప్పుడు ఇలాంటి ఇబ్బందులు తప్పదు.
ట్రైన్ పెన్నా నది దాటి ప్లాట్ ఫాం మీదకు వచ్చేసింది.
అయ్యప్ప మాలలు వేసుకుని రైలు కోసం ఎదురు చూస్తున్న స్వాములు ,ఇతర ప్రయాణికులతో ఫ్లాట్ ఫాం సందడి గా ఉంది.
నేను దిగి నా సహచరుడు ఎక్కడ ఉన్నాడో కనుకునే ప్రయత్నం లో ఉన్నాను....,

4, జనవరి 2016, సోమవారం

హలచల్ చేస్తున్న బాత్రూం వీడియో


కొన్ని వీడియో లో క్షణాలలో చాల పాపులర్ అవుతూ ఉంటాయి. ముక్యంగా ఆడవాళ్ళ ప్రైవేట్ వీడియో అంటే ఇంకేముంది జనం క్యూ కడతారు. ఒక అందమైన అమ్మాయి స్నానాల గదిలో బట్టలు విప్పుతూ ఉన్న ఈ వీడియో కూడా అంతే పాపులర్ ఇప్పుడు. అయితే ముగింపు వచ్చేసరికి చూసినవాళ్లు క్షణం అలోచించాల్సిందే. 
సామాజిక దృక్పదం తో తీసిన ఈ వీడియో ఒక్కసారి చూడాల్సిందే !

3, జనవరి 2016, ఆదివారం

తన కోపమే తనకు శత్రువు !


సహజంగా మనం పనిచేసే కార్యాలయాలలో అప్పుడు అప్పుడు మనకి కోపం వస్తూ ఉంటుంది. కొంతమంది కి ఈ కోపం ఎక్కువ గా ఉండి చివరకు ఉద్యోగం పోగొట్టుకునే స్తాయి కి వెళ్తారు. కొత్త ఉద్యోగం లో చేరటానికి మళ్ళీ రెండు మూడు నెలలు సమయం. కొన్నిసార్లు ఎక్కువ సమయం కూడా పట్టవచ్చు. తరచూ కంపెనీలు మారుతూ ఉంటే మనమీద హెచ్ ర్ మేనేజర్ లకు మనమీద దురబ్రిపాయం కలుగుతుంది.
సంస్త మీద కాని , మేనేజర్ ల మీద కాని మనకి కోపం ఉంటే మనం పనిమీద కూడా పూర్తగా శ్రద్ధ చూపించలేము. దానితో ఓటమి లోకి వెళ్ళే ప్రమాదం ఉంది. ఇలాంటి స్తితికి ఏ ఉద్యోగస్తుడు ఎప్పుడూ వెళ్ళకూడదు. ఇలాంటి స్తితి నుండి బయటకు రావాలి అంటే ఏమి చెయ్యాలి?

నెగటివ్ ఆలోచనలకు దూరంగా ఉండండి.
ప్రతి ఆఫీస్ లలో గాసిస్ప్స్ అనేవి ప్రచారం అవుతూ ఉంటాయి. ముక్యంగా బాస్ మీద , సంస్త ఎదుగుదల మీద లేదా తోటి ఉద్యోగస్తుల మీద. ముందుగా ఇలాంటి వార్తలకు దూరంగా ఉండాలి. మనం సొంతగా ఆలోచిస్తూ ఎదుట వ్యక్తి ట్రాప్ లో పడకుండా జాగర్త పడాలి. ప్రతి సంస్త కి కొన్ని బలహీనతలు ఉంటాయి వాటితో మనకు సంబంధం లేదు. కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టింది అనే తెలుగు సామెతను గుర్తుంచుకోండి. ఎప్పుడూ పాజిటివ్ గా ఆలోచించండి.

ప్రతి కార్యాలయాలలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు. 1. విమర్శించే వారు 2. నిజాయితీగా మెచ్చుకునే వారు. కొత్తగా ఉద్యోగం లో చేరినవారు ఈ రెండురకాల వ్యక్తులను గమనించి నడుచుకోవాలి.

మీ బలహీనతను ఒప్పుకోండి.

పుట్టికతో అన్ని విషయాలలో సిద్దహస్తులు కాలేరు. ప్రతి వ్యక్తికీ కొన్ని బలహీనతలు ఉంటాయి. వాటిని గుర్తించండి. ఆ బలహీనతను పదే పదే ప్రచారం చెయ్యకండి. అవసరం అయితే మీ సహచరుడి లేదా సీనియర్స్ సహాయం అడగండి. మొహమాటం పడి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఓటమి చెందే ప్రమాదం ఉంది. కొన్ని సార్లు సంస్త బారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.

కోపం తో మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.

ఆవేశం , చికాకులో మనం మాట్లాడే ముందు కొంచం జాగార్తపడాలి. ఒక్కసారి అన్న మాటలు వెనకకు తీసుకోలేము. నా 15 సంవస్తరాల అనుబవం లో చాల మంది ని చూసేను, తొందరగా వాళ్ళు తమ ఉద్యోగాలు పోగొట్టుకుంటారు. మొదట్లో నేను చాల ఆవేశానికి గురియ్యేవాడిని సంస్త సిబ్బంది మీద, వినియోగదారుల మీద నా బాస్ ఒకసారి డిన్నర్ కి వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్లి నాకు సలహా ఇచ్చేరు, నేను నిదానంగా నా ఆవేశాన్ని తగ్గించుకున్న. ప్రతి ఒక్కరికి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నలుగురితో మనం కలసి ఉద్యోగం చేస్తున్నప్పుడు జాగర్తలు తీసుకోవాలి.

నిన్ను నీవు అబినందించుకో.

అవును, ప్రతిరోజు నేను ఈ రోజు నా పనిని పూర్తి చెయ్యగలను అనే దృక్పధం తో ఉండాలి. ఈ రోజు టార్గెట్ పుర్తిఅయినప్పుడు ఎస్ నేను గెలిచెను అని ఆనందంగా ఒక చాక్లెట్ నువ్వు నీకు గిఫ్ట్ గా ఇచ్చుకో. అది మీకు మీద నమ్మకాన్ని కలిగిస్తుంది. మీ లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది.

ప్రశాంతంగా ఉండండి ...... సంతోషం గా ఉండండి