22, డిసెంబర్ 2012, శనివారం

సిగ్గు పడదాం !



బారత దేశం పుణ్యభూమి, ఖర్మ భూమి ఇక్కడ ఎందరో ఋషులు , పుణ్యస్త్రీలు నివసించిన ప్రాంతం. బుద్దుడు జన్మించిన నేల. వేల సంవస్తరాల క్రితం, చరిత్రలో పురాణాలలో మనం చదువుకున్నది కిరాతకులు చిట్టి అడవిలో , కొండ గుహల్లో ఉండేవారు , రాను రాను వారె దోపిడీ దొంగలు అయ్యారు అటుగా వొచ్చిన ఆడవాళ్ళను బలత్కరించే వాళ్ళు కానీ నేడు సభ్య సమాజం లో మన మధ్యే , మనతోనే తిరుగుతున్నారు. వావి వరసలు మర్చిపోతున్నారు , ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే బలాత్కారిస్తున్నారు , ఘోరంగా , కిరాతకంగా ప్రపంచం తలతిన్చుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు. 

నేడు దేశం అట్టూడికి పోతుంది , ఎక్కడ చుసిన నిరసనలు ,రాష్ట్రపతి భవన్ ముట్టడి , దేశ పార్లమెంట్ ముట్టడి , డిల్లీ నడి రోడ్ మీద ఒక్క 23 సంవత్సరాల యువతి మీద అత్యంత దారుణంగా ,పాశవికంగా జరిగిన రేప్ నేడు దేశం తల దించుకునెల చేసింది .

ఆది నుండి నేటి కలియుగం వరకు మనకు సమాజం స్త్రీ ని అత్యంత దారుణంగా చూస్తుంది. ముక్యంగా మనువాదుల పితృస్వామ్య వ్యవస్తలో ' స్త్రీ ' ఒక్క విలాస వస్తువు . మన అమ్మమ్మలు చెప్పే కథ లు నుండి నేటి మన మహేష్ బట్ సినిమా కథల వరకు అదే వివక్ష . చిన్నప్పటి నుండే మన మగాళ్ళు తమ మగ తనం వింటూ ఉంటారు కృష్ణుడు కి 16 వేల మంది గోపికలు , ఇద్దరు భార్యలు ఇంకా అత్యంత ప్రియమైన ప్రేయసి . ఇక్కడ అత్యంత ప్రతివతగా ,గుణ గణ లు కలిగిన రుక్మిణి ని ఆడపిల్లలకు చెబుతారు. అప్పుడే మనం ఈ వివక్షను ప్రశ్నించి ఉంటె ఈ దేశ మహిళల భవిషత్ నేడు రోడ్డుపాలు అయ్యేది కాదు ఏమో . హరిచంద్రుడు తన భార్యను వారణాసి నడి వీధిలో అమ్ముతున్నప్పుడు చంద్రమతి ప్రశ్నించి ఉంటె ! నేడు బజారులలో ఆడపిల్ల అమ్మకానికి వస్తువు అయ్యేది కాదు ఏమో . ఏదైనా మహిళలకే అవమానాలు అయిన ,అమ్మకాలు అయిన . నీవు ప్రతివతవు కాదు అన్నప్పుడు ' సీత ' లాగి రాముడు చెంపమీద కొట్టి ఉంటె ' రాముడి ' మత్తు వోదిలేది . ఒక్క ఆడది బారతదేశం నడి వీదిలో అవమానం పడి తనను తానూ ప్రతివత అని నిరుపించుకోవటానికి అగ్ని లో దూకి నిరూపించుకుంది . ప్రాతివత్యం పోగూడదు అని భర్త చితిమీద దూకింది. ఆనాడు కౌరవుల నిండు సభలో, సభ్య సమాజం ముందు ' ద్రౌపతి ' ని దుశ్శాసనుడు అవమానించినప్పుడే ఆ నాటి సమాజం ఖండించి ఉంటె నేడు అభినయ దుశ్శాసనులు నేడు మన నడి బజారుల్లో స్త్రీని బలత్కరించే వాళ్ళు కాదు.

ఏది ఏమైనా వివిధ కారణాల వలన నేడు నడి రోడ్డు మీద ఆడపిల్ల ఒంటరిగా ఉంటె తన ఉనికికే ప్రమాదం వస్తుంది . ఇందుకు సమాజం బాద్యత వహించటం లేదు . గ్లోబలీకరణ నేపద్యం లో పాచత్య అలవాట్లు , కల్చర్ మన దేశాన్ని ముంచేస్తుంది . ముక్యంగా మీడియా ప్రభావం ప్రతి ఒక్కరి మీద పడుతుంది. అడ్డమైన ధారావాహిక కథలు , రాత్రి 10 గం అయితే నేరుగా మన ఇళ్ళలోకి శృంగార కావ్యాలు వచ్చేస్తున్నాయి . బాలీవుడ్ సినిమాల రూపంలో అడ్డు అదుపులేని శృంగారం. మన పసి జీవితాలమీద బలవంతంగా రుద్దు తున్నాయి . స్కూల్స్ ముందు సినిమా ప్రకటన ఉండకూడదు అని ఎన్ని చట్టాలు చెప్పిన పట్టించు కునే నాధుడు యేడి , చట్టాన్ని దైర్యంగా అమలుచేసే అధికారి ఏడి ? 
సమాజం తన భాద్యత మరిచి పోయింది . గుడి , బడి వ్యాపార వస్తువు అయింది. ఇప్పుడు గాంధీ మనకు ఆదర్శం కాదు ' ఇమ్రాన్ హాష్మి మనకు ఆదర్శం. అభివృద్ధి ఒక్క వస్తువు , వ్యాపారలలోనే కాదు ' నాగరీకత ' లో కుడా ఉండాలి. అనాగారీకంగా స్త్రీలను మానబంగం  చెయ్యటం నాగరికత కే అవమానం .

 యత్ర  నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత 

నిజంగా ' వేద కాలం లో స్త్రీ పూజింపబడిండా ! లేక వాళ్ళు ముందుగానే మనిషి అవలక్షణం ఉహించి  చెప్పేరా !   స్త్రే " ఆది పరాశక్తి " అంటాం , అని పూజిస్తాం ఏది ఆశక్తి ? ఆనాడు ఒక్క నరకాసురుడిని చంపితే పండగ చేసుకున్నాం మరి నేడు ఊరికో నరకాసురుడు , ఆసిడ్ బాటిల్ తో , బ్లేడ్ లతో , మగతనం తో .

 అయి గిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందనుతే 
గిరివర వింధ్య శిరోధినివాసిని విష్నువిలాసిని జిష్నునుతె 
భగవతి హే శితికంతకుతుమబిని భూరి కుటుంబిని భూరి క్రితే 
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే 

మా ప్రార్ధన ఆలకించు తల్లి ఇంకొక సారి నీ విశ్వరూపం చూపించి నీ బిడ్డలను రక్షించు తల్లి !!

14, డిసెంబర్ 2012, శుక్రవారం

దున్నేవాడిదే భూమి


" దున్నే వాడిదే భూమి " ఒక్కప్పుడు ఈ నినాదం వాడ ,వాడల మార్మోగింది , లక్షలాది మంది ప్రజలు ప్రభావితం అయ్యారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రదాన ఆదాయ వనరు అయిన " భూమి " . ఎలాంటి కుల వృత్తి లేనటువంటి ప్రజలకు భూమి ఒక్క ఆయువుపట్టు . సామాజికంగా , ఆర్ధికంగా వెనకబడిన వర్గాలను వివక్ష నుండి రక్షించాలి అంటే భూమి కావలి .

దశబ్దాలు గడిచేకొద్దీ మనువాదులు ఈ దేశాన్ని , సమాజాన్ని కులం వర్గాల వారిగా విడదీసినప్పుడు అనాదిగా భూమినే నమ్ముకున్న ' ఈ దేశపు ములవాసులు ' భూమి నుండి దూరంగా నేట్టవేయబడ్డారు . భూమి లేని ప్రజలు బానిసలుగా , కూలీలుగా మార్పు చెందేరు . " పోరాడితే పోయేది ఏముంది - బానిస సంకెళ్ళు తప్పా "  ఈ నినాదం వాళ్ళ ఊపిరి అయ్యింది . అవును బానిస సంకెళ్ళ నుండి విముక్తి పొందటానికి ఇంటికొక మనిషి గుట్టల్లో , చెట్టులో తమ ప్రాణాన్ని పెట్టి పోరాడరు . భరత మాత తమ పిల్లల కోసం తనే రాసుకున్న రాజ్యాంగాన్ని కాదు అని బానిసలుగా , వెట్టి చాకిరి చేయిస్తున్న పెట్టందారులను ఎదుర్కోవటానికి ఒక్కొకరు ఒక్క " సూర్యుడి " లా భగ ,భగ మండేరు.

కాలం మారింది , ప్రజల తిరుగుబాటు కు ప్రభుత్వాలు కదిలేయి , మీకోసం భూమి పంచుతాం అన్నారు , అడవి , గుట్ట , నీరు మీదే అన్నారు . రాళ్ళూ ,రప్పలు , తప్ప నీరులేని భూమి ఇచ్చేరు అయిన సరే తమ రక్తాన్నే నీరుగా పోసి బంగారాన్ని పండించేరు . బానిస - బంగారాన్ని పండించేడు . పెద్దోడి కన్ను బగారం మీద - కాదు బంగారం లాంటి భూమి మీద పడింది 

భరత మాత ' మాట తప్పింది ' ! మీ కోసం ఈ  భూమి అన్న నోరు ఇప్పుడు అదే నోటి తో అబద్దం ఆడుతుంది. మీకోసం అభివృద్ధి అంటూ అదే గుట్టలను , భూమిని భలవంతాన లాక్కుంటుంది. బ్రతిమిలాడి , దండం పెడితే తుపాకి ఎక్కుపెట్టింది. తిరగబడితే యుద్ధం ప్రకటించింది . బారతమాత తన బిడ్డలు మీద " యుద్ధం " ప్రకటించింది. 

66 సంత్సరాల స్వాత్రంత  బారత దేశం ప్రజల మీద యుద్ధం ప్రకటించింది. భూమి అడిగిన పాపానికి యుద్ధం ప్రకటించింది. ఇన్ని సంత్సరాలు పాలకులు చూపిన అభివృద్ధి నీటి రాతలే . నేటికి కిలో బియ్యం కొనలేని స్తితిలో ఇదే పాలకులు ప్రజలను బిచ్చగాళ్ళుగా తమ దుకాణాల మీద నుంచో పెట్టింది . ఎవరికోసం ఈ కిలో " రూపాయి " బిక్ష . భూమి , నీరు మీరు తీసుకుని మాకు బిక్ష ఇస్తారా ! అని అడిగే శక్తి లేని ప్రజలను ఓట్ల రాజకీయాల కోసం బిక్షగాళ్ళను చేస్తుంది .అభివృద్దిని అరచేతిలో చూపించి , ఇంకొక చేతితో పీకలు నోక్కేస్తుంది.

ప్రజా ప్రభుత్వాలు భందు ప్రీతి , అవినీతి ఊబిలో పీకల్లోతుల్లో మునిగి సంబరాలు చేసుకుంటున్నాయి. ప్రపంచీకరణ , గ్లోబలైజేషన్ లో ప్రజలను వలస వాదులు గా చేస్తున్నాయి . పెట్టుబడి దారుల గుప్పెట్లో ప్రజా ప్రభుత్వాలు అత్యంత క్రూరంగా ప్రజలను భూమి నుండి దూరం చేస్తున్నాయి. ఆర్ధిక అవసరాల కోసం ప్రపంచ దేశాలు ఒక్కటి అవుతున్నాయి , కానీ ఆ దేశం లోని ప్రజలను విడదీస్తున్నాయి . తర తరాలుగా వెనకబడి అభివృద్ధి కోసం , తమ స్తితి గతుల్లో మార్పు కోసం ఒక వర్గం గా , అభివృద్ధి పేరుతొ ప్రజలను దోచుకున్న ఇంకొక వర్గం ఇంకొక వైపు !
అందుకే " దున్నేవాడిదే భూమి " కావలి , ఇంకొక్క సారి మారుమోగాలి 

అదిగో వస్తున్నాయి , వస్తున్నాయి 
జగన్నాధ రధచక్రాలు ...,
వద్దు ,ఇంకా ఆశపడకండి .

ఈ భూమి , నీరు మనదే. పోరాడండి , పోరాడితే పోయేది బానిస సంకెళ్ళు .