16, ఆగస్టు 2012, గురువారం

నేటి భారతం


మీకు హిందీ నటుడు మనోజ్ కుమార్ నటించిన రోటి  - కపడా - ఔర్ మఖాన్ గుర్తు ఉండే ఉంటుంది. ఆ సినిమా పేరు లాగానే నేటి మన దేశం లోని కోట్లాది మంది రోటి కాపాడ మఖాన్ సినిమా . ఈ 65  సవస్తరాల స్వత్రంత బారత దేశం లో పిడికిలి గింజలు కోసం రోజు పోరాటమే . ఆ రోజుల్లోనే నేటి మన దేశ భవిషత్  ఉహించి రాయటం చాల అచ్చర్య కరం .

స్వాత్రంతం రాకముందు తెల్ల దొరలూ ఈ దేశ ప్రజల రక్త మాంసాలను హరించి వేస్తె నేటి పాలకులు వాళ్ళనే అనుసరించటం శోచనీయం .ఆనాటి ప్రజలు స్వాత్రంతం వచ్చిన తరువాత " రామ రాజ్యం " వస్తుంది ఏమో అని భ్రమ పడ్డారు . ఆ రాజ్యం లో కూటికి  , గుడ్డకు లేని భారతీయులు ఉండరు ఏమో అని భ్రమ పడ్డారు . శ్రీమతి ఇందిరా గాంధీ ప్రవేసిపెట్టిన " గరీబ్ హటావో "  కూడా ఈ దేశ ప్రజల ఆకలి తీర్చలేక పోతుంది .65 యేండ్ల స్వత్రంత భారత సమాజం రోజు రోజుకి భక్క చిక్కి పోతుంది .రోజు రోజు కి ఈ దేశం లో అవినీతి , భందు ప్రీతి ఎక్కువైపోతుంది . ప్రభుత్వాలకు మానవత్వ లేకుండా పోతుంది .లక్షలాది క్వింటాళ్ళ ధాన్యం ముక్కి పోతుంటే ఇంకొక వైపు ఒడిష లాంటి రాష్ట్రాలలో ప్రజల ఆకలి చావులు  . రాజకీయ నాయకులూ , పెట్టుబడుదారులు ,ప్రభుత్వ అధికారులు కలసి పోయి ఈ దేశ ఆర్ధిక వ్యవస్తను రాబందుల్ల దోచుకుంటున్నారు .

బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని , ఈ దేశ సంపదను సాంస్కృతిక వారసత్వాన్ని  దోచుకు వెళ్ళితే, వాళ్ళ అడుగు జాడల్లో నడిచే  మన కుహన మేధావి వర్గం ప్రపంచీకరణ పేరుతొ మన culture ని వెకిలి చేష్టలతో , బావ దారిద్రం తో అవమానిస్తున్నారు . 

మన అందరికి తెలుసు రత్నాలు రాసులు గా పోసి రోడ్ల మీద అమ్మిన ఘనత మనది . కనీసం ఇంటికి తలుపులు కూడా లేకుండా ఉన్న ప్రాంతం మనది అలాంటి మన దేశం లో ఈ రోజు ఎక్కడ చుసిన అవినీతి , లంచగొండి తనం , కల్తి వస్తువులు ధనార్జనే ధ్యేయం . ప్రపంచానికి ధర్మం సిద్దాంతం అందించిన  మన పవిత్ర భూమి మీద ఎందుకు మనం కులం ,మతం ,ప్రాంతం పేరుతొ ఒక్క సమాజం లో నివసించే మనం శత్రువులుగా , ఒకరి మీద ఒక్కరు అపనమ్మకం తో జీవిస్తున్నారు .

ఆర్దిక అసమానతలు ఈ దేశానికి పెను సవాల్  ఆరోజే ఈ అసమానతలు తొలగించి ఉంటె బావి భారతం నేడు ఈ ప్రసవ వేదన నుండి బయట పడేది. దగాకోరు పాలకుల నుండి స్వేచగా స్వతంత్ర ఫలాలను అనుభవించి ఉండేవాళ్ళం .

మనం ఒక్క బొంబాయి నగరాన్నే తీసుకుంటే 62 % మంది బొంబాయి ప్రజలు మురికి వాడల్లోనే జీవిస్తున్నారు ఈ జనాబా మొత్తం మహానగరం 6 % భూమి లో నివసిస్తున్నారు . ముంబై మురికి వాడల వృద్ది రేట్ ముంబై మహానగరం అభివృద్ధి కంటే ఎక్కువ . ఈ దేశ నిరుపేదలు ప్రస్తుత సరళీకృత ఆర్ధిక విధానం తో ఇంకా పేదలు గానే ఉండిపోతున్నారు . వీళ్ళు బతుకు చిత్రం ఆస్కార్ లాంటి అవార్డు లు గెలవవచ్చు కానీ వీళ్ళు మాత్రం ఇంకా పేదలు గానే ఉండిపోతున్నారు . పల్లెటూరు పెట్టె సర్దుకొని నగరాల దారి వెతుకుంటున్నారు. ఊర్లు , ఊర్లు కాలి అయిపోతున్నాయి గుప్పెడు గింజలు కోసం . 

ఈ దేశ ప్రజలకు ఇంకా ప్రభుత్వాల మీద ఆశ ఉంది అందుకే తిరుగుబాటు చెయ్యకుండా " mang rahahai hindustan ..,roti - kapada -Aur makaan  ....అంటూ పాడుకుంటూ ఆశతో జీవిస్తున్నారు .